Tuesday, October 11, 2011

తలచుకోడానికైనా మిగలని ‘తాండా’!

తలచుకోడానికైనా మిగలని ‘తాండా’!
banjara-photo

సాహిత్యంలో నేటికి అనేక రకాలైన ప్రక్రియ లు చోటుచేసుకొని ఉన్నాయి. ప్రస్తుత తరు ణంలో నూతనంగా ప్రవేశిస్తున్న ప్రక్రియ, చేరడానికి ఆవశ్యకత ఉన్న ప్రక్రియ గిరిజన సాహిత్యం. తెలు గులో గిరిజన సాహిత్యం ఏ రకంగా ఉంది, అసలు ఉందా, ఉంటే ఎవరు రాశారు, అందులో ఏ తెగల జీవితాలు చిత్రితమయ్యాయి- అనే సవాలక్ష ప్రశ్న లు- మనకు మనం వేసుకోవల్సిన తరుణం. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజన సాహిత్యాన్ని తేవాల్సిన అవసరం, రాయా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. గిరిజన సాహిత్యం లేదా బంజారాల గురించి అనువాదాలు ఏమైనా వచ్చాయా అనే ప్రశ్న వేసుకున్నప్పుడు- ‘తాండా’ నవల తారసపడింది. ఈ నవల కన్నడంలో ‘హవన’ పేరుతో వెలువడింది.

దానిని ‘హిరేమఠ్‌’ రాశాడు. తెలుగులో జయశ్రీ మోహన్‌ రాజ్‌, ఎస్‌ మోహన్‌ రాజ్‌ అనువదించారు. ఈ నవలలో లంబాడాల సంస్కృతిని ఎంతో గొప్పగా చిత్రిం చారు. వారి దినచర్య, వారి పండుగలు, కట్టుబాట్లు, స్థూలంగా మొత్తం లంబాడాల సంస్కృతి కనిపిస్తుంది. ఈ నవలలో కర్ణాటక ప్రాంతంలో ఉన్న లంబాడీల గురించి చిత్రించారు.ప్రాంతం వేరు కావచ్చు, రాష్ట్రం వేరు కావచ్చు- కానీ, బంజా రాల జీవితం ఎక్కడున్నా ఒక్కటేననే భావన ఈ నవల చదివిన పాఠకుడికి కలుగుతుంది. నవలలో తాండా నాగరిక ప్రపం చానికి దూరంగా తనదైన సంస్కృతితో, సమష్టి తత్త్వంతో ఉండే లంబాడా తండాలలో ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపార నాగరికత ప్రవేశించడం వల్ల అక్కడి మానవ సంబంధాలు ఎలా మారిపోయాయో చిత్రించింది ఈ నవల.

సాహిత్యంలో చిత్రించిన బంజారాల సంస్కృతిని ఆధారంగా చేసుకొని, ప్రస్తుత బంజారాల సంస్కృతిని అంచనా వేస్తే అనేక విషయాలు దృష్టికి వస్తాయి. ప్రపం చంలో ఎక్కడున్నా బంజారాల సంస్కృతిని గుర్తు పట్టేంత స్థాయికి ఎదిగింది. కానీ, అటువంటి సంస్కృతి నేడు అంతిమ దశకు చేరుకుంటోంది. సాహిత్యాన్ని ప్రామాణికంగా తీసుకొని బంజారాల సంస్కృతిని అంచనా వేస్తే చాలా తేడాలు కనిపిస్తాయి. అందుకే తాండా రచయిత బంజారాల జీవితాన్ని ఎంతో ఉన్నతం గా, హృద్యయంగా చిత్రించారు.
ప్రాచీన కాలం నుండి బంజారాలు ఉన్నారని చీనాయ్య నాయక్‌ లాంటి పరిశోధకుల వల్ల తెలు స్తోంది. బంజారాల చరిత్రను అలా ఉంచితే, తర తరాలుగా వస్తున్న బంజారా సంస్కృతిలో భాగ మైన దుస్తుల పరిస్థితి ఏమిటి? బంజారాల దుస్తు లకు నేడు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ ఉన్నప్పటికి, బంజారాలకు మాత్రం దూరమ వ్వసాగాయి. అసలు బంజారాలు అటువంటి దుస్తులు వేయడానికి కారణమేమిటి? నేడు ఎందుకు దూరంగా పెట్టుకుంటున్నారు. పన్నెండవ శతాబ్దంలో పృథ్వీరాజ్‌ చౌహాన్‌ రెండవ తైరాన్‌ యుద్దంలో ఓడిపోయాడు. దాంతో ముస్లిం సైన్యాలు పృథ్వీ రాజ్‌ చౌహాన్‌కు చెందిన వారందర్ని తరిమికొట్టడం మొదలు పెట్టారు. భయంతో పృథ్వీరాజ్‌ ఆస్థానంలో ఉన్న బంజారాలు అడవుల్లోకి వెళ్ళిపోయి తలదాచుకున్నారు.

వేషం మారిస్తే అడవి మనుషుల్లాగా ఉంటామని గ్రహించి, అప్పటి వరకు ఉన్న వేషాన్ని మార్చివేసి చెట్ల ఆకులతో, జంతువుల దంతాలతో కొన్ని వస్తువులను తయారుచేసుకొని ధరించడం మొదలుపెట్టారు. అలా క్రమ క్రమంగా బంజారాల దుస్తులు ఒక రకమైన సౌందర్యంతో ఆకట్టుకునే విధంగా తయారయ్యాయి.
బంజారాల దుస్తులు కొంత బరువుతో కూడినవి, కొంత శ్రమతో కూడినవి. ఎందుకంటే వాటిని తయారు చెయ్యడానికి నెలల తరబడి కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి తయారు చేస్తే దాదాపు చిరిగిపోవడం అరుదు. బంజారాల్లో పురుషులు వేసుకొనే దుస్తుల కంటే, స్ర్తీలు వేసుకునే దుస్తులకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంటుంది.

పది సంవత్సరాల క్రితం ఏ తాండాకు వెళ్ళినా బంజారా స్ర్తీలు తమ వేషధారణలో కనిపిస్తుండేవారు. కానీ, నేటి పరిస్థితి అలా లేదు. ఒక మండలం పరిధిలో ఉన్న తండాలన్ని తిరిగినా, బంజారా స్ర్తీలు తమ వేషధారణలో కనిపించ రు. ఎక్కడో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ముసలివాళ్ళు, ఇంకా ఆధునిక దుస్తులు ధరించలేని, ధరించే శక్తి లేని వాళ్ళు తప్ప మరెవరూ ఆ సంప్రదాయ దుస్తుల్లో కనిపించరు. ఎందుకు బంజారాలు తమ దుస్తులకు దూరమవుతున్నారు? స్ర్తీలు గిరిజన దుస్తులైన పెట్యా, కాళీ ధరించాల్సినది పోయి ఆధునిక దుస్తులైన చీర, రవిక ధరిస్తున్నారు. పురుషులు కూడా తమ తమ సంప్రదాయ దుస్తులను ధరించకుండా ప్యాంట్‌, షర్ట్‌ ధరిస్తున్నారు.

అభివృద్ధి చెందాలని ప్రతి మనిషికీ ఉంటుంది. ప్రభుత్వం కూడా అదే దిశలో కృషిచేయడానికి ప్రయత్నిస్తోంది. నిరంతరం ధరించకపోయినా, కనీసం పండుగలప్పుడైనా, పెళ్ళిళ్ళప్పుడైనా ధరిస్తే బాగుండేది. ఇది కూడా కనుమరుగయ్యే స్థితి వచ్చింది.బంజారాల తరతరాల నుండి వస్తున్న పండుగ తీజ్‌. తీజ్‌ పండుగంటే బంజారా లకు ఎంతో ఇష్టం. శ్రీకృష్ణుడు రాధా గోపికలతో జల క్రీడలో ఉన్నప్పుడు గోవుల సంగతి మర్చిపోతాడు. ఆ తర్వాత జ్ఞాపకం వచ్చి, ఎనిమిది రోజులు ఎక్కడ వెదికినా దొరకక నిరాశ చెంది ఇంటి ముఖం పట్టగా ఆవు పేడ కనిపించింది. ఆ పేడలో చిన్న చిన్న మొలకలు కనిపించాయి. ఆ మొలకను శ్రీకృష్ణుడు నువ్వెవరని ఆడిగితే ‘నేను భాగీరథిని’ అని సమాధానం ఇస్తుంది.

అప్పటి నుండి మొలకల పండుగ జరుపుకుంటున్నారు. దానికి కాలక్రమం లో ‘తీజ్‌’ పండుగగా పేరు మారింది.తీజ్‌ పండుగను రాజస్థాన్‌, హర్యానా మొదలగు రాష్ట్రాలలో పెద్ద పండుగగా నేటికి జరుపుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి లేదు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలలో ‘తిజేరి ఓల్డ్‌ కమరాయి జా/ కమరాయి జా సారీరాత్‌ కీఢళ ఖోజా/ మారీ సాతణురో మూండో కమరాయిజా సారీరాత్‌కీలోఢళఖోజ్‌జా’ అనే పాటతో పలకరించే తాండాలో నేడు అవేమి వినిపించడం లేదు. ఎక్కడా కనిపించడం లేదు. ఒక్కప్పుడు తాండాలో ఉన్న యుక్త వయస్కురాలైన స్ర్తీలు తీజ్‌ పండుగ ఎప్పుడొస్తుందని ఎదురు చూసే వారు.

ఈ పండుగను తొమ్మిది రోజులు ఎంతో ఆనందంగా జరు పుకుంటారు. నేడు తీజ్‌ పండుగను మరొక పండుగతో కలిపి చేసుకుంటున్నారు. ప్రధానంగా హిందువుల పండుగలు నాటి నుండి ఆచరణలో ఉన్నా, అవీ బంజారాల పై అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ, ప్రపంచీ కరణ నేపథ్యంలో వచ్చిన మార్పు, వస్తున్న మార్పులు బంజారాల పండుగలపై విపరీతంగా ప్రభావం చూపాయని చెప్పవచ్చు. బంజారాలు తమ సంస్కృతికి దూరమై అన్య సంస్కృతికి అలవాటు పడ్డారని, పడుతున్నారని తెలుస్తోంది. అన్య సంస్కృతికి అలవాటు పడడం మంచిదే. కానీ పూర్వ సంస్కృతినీ కాపాడుకోవల్సిన అవసరం ఉంది.

తీజ్‌పండుగ స్థానంలో తాండాలలో ‘వినాయక చవితి’ ప్రవేశించింది.ఆధునికంగా వచ్చిన మార్పు వల్ల ఈ విధానం మారింది. మార్పు మంచిదే. కానీ అసలుకే మోసం వస్తేనే అసలు సమస్య ఎదురౌతుంది. ఈ రోజులలో ప్రతి వారూ ఎవరి ఉనికిని వాళ్ళు కాపాడుకోవడానికి, నిలుపు కోవడానికి తంటా లు పడుతున్న తరుణం. ఒక్క క్షణం కూడా తీరిక లేనంటువంటి కంప్యూటర్‌ యుగంలో తొమ్మిది రోజులు వృథా చేసుకొని తీజ్‌ పండుగను జరుపుకోవడానికి ఎలా ముందుకు వస్తారు? ఇలాంటి పరిస్థితుల వల్లనే బంజారాల సంస్కృతి రోజు రోజుకు క్షీణించిపో తోంది. ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళ తరువాత ఆంధ్రదేశంలో బంజారాల సంస్కృతి కనుమరుగయ్యే స్థితి ఏర్పడుతుంది. దీనిని బంజారా సమాజం గుర్తించాలి.

ఆధునికంగా అభివృద్ధి సాధించినా, తమ ఆస్తిత్వాన్ని మరిచిపోకూడదు. నిరం తరం తమ ఆస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుండాలి. అందుకే పూర్వ కాలం నుండి మానవుడు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్నో పోరాటాలు, సాహసాలు చేశాడు. అప్పుడే ఒక తరంలో ఉన్నటువంటి భావాలు మరో తరానికి అందుతాయి. లేకపోతే అవి అంతటితోనే కాలగర్భంలో కలిసిపోతాయి. ఈ మధ్య అనుకరణ అనేది తప్పనిసరిగా మారింది. సాధారణంగా సాహిత్యం లో అనుసరణ పాటిస్తుంటాం. కానీ, ఆ అనుసరణ కేవలం సాహిత్యంలోనే కాకుం డా, జీవితంలో కూడా ఎక్కువ స్థాయిలో అమలు జరుగుతోందని చెప్పవచ్చు.
ఒక ప్రాంతంలో చేసే, పండుగలు, ఆచారాలు మరో ప్రాంతంలో చేయడానికి ప్రజలు వెనకడుగు వేయడం లేదు. ఈ అనుకరణ, లేదా అనుసరణ వల్లే బంజారాలు తీజ్‌ పండుగను మరచిపోయి, వినాయకచవితి పాటిస్తున్నారు. అలాగే దుస్తుల విషయంలో కూడా అనుసరణకే ప్రాముఖ్యత. బంజారాల సంస్కృతిలో భాగమైన అనేక అంశాలు నేడు కనుమరుగయ్యే స్థితి. ఈ తరుణంలో బంజారాల సంస్కృతి రికార్డు చేయడానికి కొన్ని రచనలు సాహిత్య రూపంలో రావల్సిన తరుణం ఆసన్న మైంది. లేకపోతే కొన్నాళ్ళ తరువాత ఎవరి సంస్కృతి ఎలాంటిది, ఎవరి దుస్తులు ఎలాంటివి అనేవి అర్థం కావు. ఇప్పటికే బంజారా దుస్తులను బంజారేతరులు, సినిమా పరిశ్రమవారు విపరీతంగా వాడుకుంటున్నారు. వాటి స్థానంలో కొత్త మార్పులు ప్రవేశింప జేసి, బంజారాల సంస్కృతి ఒక్కప్పుడు అలా ఉండేదా? అనే సందిగ్ధాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడు కోవల్సిన అవసరం ప్రతి బంజారాకు ఉంది.
ఈ వ్యాసం 10.10.2011 రోజు సూర్య లో ప్రచురితమైంది.

No comments:

Post a Comment